in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
www.facebook.com/profile.php?id=61564151365001&mib…
Please do like share and follow for more interesting updates on Facebook page.....
4 - 0
*తిరుపతి జిల్లా*
*ఒకేరోజు 15 కంపెనీలు ప్రారంభం - మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు*
*సీఎం చంద్రబాబు తిరుపతిలోని శ్రీసిటీలో పర్యటించనున్నారు.*
*శ్రీసిటీలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.*
*15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు.*
*రూ.900 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థల ద్వారా 2 వేల 740 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.*
కూటమి ప్రభుత్వ రాకతో ఆంధ్రప్రదేశ్కు మంచిరోజులు వచ్చాయి. పెట్టుబడుల కోసం కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి. మరోవైపు పలు కంపెనీలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభిచేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు.
సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని శ్రీసిటీలో పర్యటించనున్న సీఎం, పలు పరిశ్రమల ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం ఉదయం 11 గంటలా 40 నిమిషాలకు విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న సీఎం చంద్రబాబు, హెలికాప్టర్ ద్వారా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీసిటీకి వెళతారు.
ఉండవల్లిలో ఉదయం 10 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి 11.30 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం శ్రీసిటీకి వెళ్లనున్నారు. శ్రీసిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పలు సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. 15 సంస్థల కార్యకలాపాలను శ్రీసిటీలో సీఎం ప్రారంభించనున్నారు. మరో 7 సంస్థల ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
900 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2 వేల 740 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. మరో 1,213కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించి నాలుగు ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది.
అనంతరం శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. దక్షిణ కొరియాకు చెందిన ఎల్జికెమ్, ఇజ్రాయిల్కు చెందిన నియోలింక్, జపాన్కు చెందిన నైడిక్, ఓజెఐ ఇండియా ప్యాకేజ్, జర్మనీకి చెందిన బెల్ పరిశ్రమలతో పాటు భారతదేశానికి చెందిన అడ్మైర్, ఆటోడేటా, బాంబేకోటెడ్ స్పెషల్ స్టీల్స్, ఈప్యాక్, ఇఎస్ఎస్కెఏవై, ఎవర్షైన్, జేజీఐ, త్రినాత్, జెన్లెనిన్ సంస్థలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
చైనాకు చెందిన ఎన్జీసీ, బెల్జియంకు చెందిన వెర్మేరియన్, జపాన్కు చెందిన ఏజీ ఆండ్ పీ పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. జపాన్కు చెందిన రెండు పరిశ్రమలు, యూఏఇ, సింగపూర్లతో పాటు భారతదేశానికి చెందిన ఒక్కో పరిశ్రమ ఏర్పాటుపై ఒప్పందాలు చేసుకోనున్నారు. శ్రీసిటీలో పర్యటన అనంతరం నెల్లూరు జిల్లాలోని సోమశిల సాగునీటి ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించనున్నారు. తిరిగి సాయంత్రం ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.@SamStudios9
3 - 0
🔴 *BREAKING...*
|| *2026లోనే శాసనసభ స్థానాల పెంపు* ||
◽ స్పష్టం చేసిన కేంద్రం
◽ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లలో శాసనసభ స్థానాల పెంపు 2026 లోనేనని కేంద్రం స్పష్టం
◽ రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026లో జనాభా లెక్కల అనంతరమే *ఏపీలో 175 నుంచి 225 శాసనసభ స్థానాలు*
◽ *తెలంగాణలో 119 నుంచి 153 శాసనసభ స్థానాల పెంపు*
◽ నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడే ఎస్సీ ఎస్టీ స్థానాల పునఃసర్దుబాటు
◽ ఆంధ్రప్రదేశ్ పునర్విభ జన చట్టం -2014ను న్యాయమంత్రిత్వ శాఖ ద్వారా మార్చి1, 2014న గెజిట్ లో ప్రచురించినట్లు వివరణ
4 - 0
Sam Studios is a channel with all kind of interviews and news and more....for any kind of interviews or adds Kindly contact 9347177589 ...WhatsApp also the same number....