in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్
అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న మాట వాస్తవం కాదా?
ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడం నిజం కాదా?
సేవలు నిలిపేస్తామని ఆస్పత్రులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదు?
కొత్త వైద్య కళాశాలలపై స్కామ్ చేసినట్టే ఆరోగ్యశ్రీనీ ప్రైవేట్కు కట్టబెడుతున్నారు
కోవిడ్ వంటి కొత్త రోగాలు, అరుదైన వ్యాధులొస్తే పరిస్థితి ఏమిటి?
గత ప్రభుత్వం విచక్షణాధికారంతో ఆరోగ్యశ్రీ వర్తింప చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడింది
ఈ పని ప్రైవేటు కంపెనీలు చేయగలవా? మీ ప్రభుత్వం చేయించగలదా?
కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి ఉన్న గ్యారంటీనీ తీసేశారు..
విజయవాడ వరద బాధితులకు బీమా విషయంలో మీ హామీ ఏమైంది?
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలన్నీ ఎగరగొడుతున్నారు..
గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేస్తున్నారు..
ఆరోగ్యశ్రీని యథాతథంగా కొనసాగించాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నా
#pawankalyan #chandrababunaidu #ysjagan #ysrcp #apnews #arogyasree
2 - 0
Former Prime Minister Manmohan Singh (92) passed away. Priyanka Gandhi's husband Robert Vadra tweeted this. He fell seriously ill this evening and was shifted to AIIMS in Delhi. Doctors treated him in the emergency ward. But the doctors said that Manmohan breathed his last shortly after.
#manmohansingh #ripmanmohansingh
0 - 0
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ట్వీట్ చేశారు. ఇవాళ సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స చేశారు. అయితే కొద్దిసేపటికే మన్మోహన్ తుది శ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు.
#manmohansingh
0 - 0
YSRCP: వైసీపీ ‘పోరుబాట’.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు.. YSRCP: విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వైసీపీ సిద్ధమైంది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు తిరగకుండానే ప్రజలపై 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపిందని ఆరోపిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దీనికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వైసీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించటంతో పాటు ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాలను వేయటం దారుణమని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
0 - 0
టాలీవుడ్ ఇండ్రస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్..
ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పిన సీఎం..
#cmrevanthreddy #alluarjun #revanthreddy
0 - 0
ప్రేమను అంగీకరించలేదని యువతిపై రాడ్డుతో దాడి
విశాఖలో రెచ్చిపోయిన యువకుడు..
తన ప్రేమను అంగీకరించలేదని యువతిపై దాడికి దిగాడు. యువతి ఇంటికి వెళ్లిన నీరజ్ శర్మ ఇనుప రాడ్డుతో దాడిచేశాడు. తీవ్రగాయాలవ్వడంతో యువతిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పెదగంట్యాడ మండలం బీసీరోడ్లో చోటు చేసుకుంది. దాడి అనంతరం నిందితుడు నీరజ్ శర్మ పరార్ అయ్యాడు. ఈ ఘటన విశాఖలోని పెదగంట్యాడ మండలం బాల చెరువు వద్ద చోటు చేసుకుంది. బాధితురాలి తలపై వైద్యులు 30కి పైగా కుట్లు వేశారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని కిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#vishakapatnam #andhrapradeshcrimes
0 - 0
TELUGU SHOTS
VIRALNEWS VIRAL VIDEOS